Type Here to Get Search Results !

ప్రశ్నోత్తరాల లో మహాభారతం

0

మహాభారతాన్ని రచించిన వ్యాసుని అసలు పేరు?

కృష్ణ ద్వైపాయనుడు.

మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?

క్రీ.పూ. 16వ శతాబ్దం.

వేదాలకు, భగవద్గీతకూ తేడా ఏమిటి?

వేదం మంత్ర భాగం. ఉపనిషత్తు అర్ధాన్ని సులభంగా శ్లోక రూపంగా చూపేది భగవద్గీత.

వ్యాసుడి తల్లి పేరు?

సత్యవతి.

వ్యాసుడి తండ్రి?

పరాశరుడు.

కురుక్షేత్రము అనగా?

కురురాజు దున్నిన ప్రాంతము.

భీష్ముడి తండ్రి?

హస్తినాపురాన్ని పరిపాలించే శంతన మహారాజు.

భీష్ముడి తల్లి?

గంగా దేవి.

భీష్ముడి అసలు పేరు?

దేవవ్రతుడు.

పాండురాజు, మాద్రి ఎక్కడ మరణించారు?

శతశృంగగిరిలో మరణించారు.

శల్యుడు ఎవరు?

మాద్రికి అన్న.

పాండవులు ఎక్కడ జన్మించారు?

శతశృంగగిరిలో.

శతశ్రంగగిరి ఎక్కడుంది?

టిబెట్‌లో

గాంధారి తండ్రి పేరు?

సుబలుడు.

కృష్ణుడు అనగా?

కృష్ అంటే సత్. ణ అంటే ఆనందం. కృష్ణ అంటే సదానందము, సచ్చిదానందము అని అర్ధం.

శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను ఏ చెట్టుపై దాచాడు?

పొన్నచెట్టుపై

శ్రీకృష్ణుని శంఖము పేరేమిటి?

పాంచజన్యం.

కంసుడి తండ్రి?

ఉగ్రసేనుడు.

కంసుని మామ ఎవరు?

జరాసంధుడు.

శిశుపాలుడి తల్లి?

సాత్వతి.

"నీవు కోరిన దేవత నుండి కోరిన బిడ్డను కనగలవు" అని కుంతీదేవికి వరమిచ్చిన ఋషి ఎవరు?

దూర్వాసుడు.

పాండవులు నివశిస్తున్న లక్క ఇంటిని తగులబెట్టేందుకు దుర్యోధనుడిచే నియమింపబడ్డ మంత్రి?

పురోచనుడు.

ద్రోణుడి తండ్రి పేరు?

భరద్వాజుడు.

ద్రుపదుడు ఎవరు?

పాంచాల దేశపు రాజు.

ద్రుపదుని బిడ్డలు ఎవరు?

దృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

దృష్టద్యుమ్నుడి గురువు ఎవరు?

ద్రోణుడు.

సుభద్ర ఎవరి కూతురు?

దేవకీ వసుదేవుల కూతురు, శ్రీ కృష్ణుని చెల్లెలు.

అర్జునుడు సుభద్రను పెళ్ళాడిన ప్రదేశం?

ద్వారక.

అర్జునుడు, సుభద్రలకు జన్మించినవాడు?

అభిమన్యుడు.

హస్తినాపురంలో మాయాజూదం జరుగుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు ఎక్కడున్నాడు?

ఆ సమయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని మిత్రుడు సాల్వుడు ద్వారకపై దండెత్తగా అతనితో యుద్ధం చేస్తూ ఉన్నాడు.

శ్రీ కృష్ణుడి కుమారులు?

ప్రద్యుమ్నుడు మరియు సాంబుడు.

శిశుపాలుడి కుమార్తె పేరు?

రేణుమతి.

రేణుమతిని పెండ్లాడినవాడు?

నకులుడు.

అభిమన్యుని భార్య పేరు ఏమిటి?

ఉత్తర.

సహదేవుడి భార్య పేరు?

విజయ.

శకుని కుమారుడి పేరు?

ఉలూకుడు.

అజ్ఞాతవాసంలో విరాటుని కొలువులో పాండవులు ఏయే పేర్లతో ఆశ్రయం పొందారు?

ధర్మరాజు విరాటరాజుకు పుణ్య కథలు చెప్పే కంకుభట్టు పేరుతోనూ, భీముడు వలలుడు అను పేరుతో వంటవానిగానూ, అర్జునుడు నపుంసకునిగా బృహన్నల పేరుతోనూ, నకులుడు దామగ్రంధి పేరుతో అశ్వ శిక్షకుడుగానూ, సహదేవుడు తంత్రీపాలుడు పేరుతో గోసంరక్షకునిగానూ, ద్రౌపది విరాట రాణి అయిన సుధేష్ణ పరిచారికగా సైరంధ్రి పేరుతోనూ చేరతారు.

శకుని మరియు ఉలూకుడు ఎవరి చేతిలో మరణించారు?

సహదేవుడు.

కర్ణుడి కొడుకులను చంపినవాడు.

నకులుడు.

సాత్యకి ఎవరు?

అర్జునుడి శిష్యుడు.

కురుక్షేత్ర యుద్ధం సమయంలో బలరాముడు ఎక్కడున్నాడు?

యుద్ధంలో పాల్గొనడం ఇష్టంలేని బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు.

శిఖండి ఎవరు?

కాశీరాజు కూతురు అంబయే శిఖండి.

పాండవులు-వారు పూరించిన శంఖాలు :

అర్జునుడు - దేవదత్తం

ధర్మరాజు - అనంత విజయం

భీముడు - పౌండ్రం

నకులుడు - సుఘోష

సహదేవుడు - మణిపుష్పక

శ్రీ కృష్ణుడు - పాంచజన్యం

ఉత్తరుడు ఎవరి చేతిలో మరణించాడు?

శల్యుడు.

దుర్యోధనుని కొడుకు లక్ష్మణుని వధించినవాడు?

అభిమన్యుడు.

ద్రోణుడు ఎవరి చేతిలో మరణించాడు?

దృష్టద్యుమ్నుడు.

సైంధవుడు ఎవరు?

ఇతను సింధు చక్రవర్తి వృద్ధాక్షాత్రుడి పుత్రుడు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించడంతో అతనికి రక్షగ తోడు వెళ్ళబోయిన ధర్మరాజు వంటి పాండవ యోధులను లోనికి రాకుండా నిరోధించిన వాడు.

వికర్ణుడు ఎవరు?

కర్ణుడి కుమారుడు.

వికర్ణుడిని సంహరించినవాడు?

భీముడు.

శల్యుని సంహరించినవాడు?

ధర్మరాజు.

దుర్యోధనుడు యుద్ధరంగమునుండి పారిపోయి దాగిన మడుగు?

ద్వైపాయన మడుగు.

దృష్టద్యుమ్నుడినీ, శిఖండినీ, ఉపపాండవులను నిద్రిస్తుండగా వధించినవాడు?

అశ్వత్థామ
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages