సంఘటనలు
- 1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు
- 1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.
- 1930: వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర 'మిక్కీ మౌస్' కామిక్ స్ట్రిప్ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
- 1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆమోదం లభించింది.
- 1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
- 1879: 'లయన్స్క్లబ్' స్థాపకుడు మెల్విన్జోన్స్జన్మదినం. అమెరికాకు చెందిన ఈయన 1917 అక్టోబరులో తన మిత్రులతో కలసి లయన్స్ క్లబ్ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 దేశాల్లో 40 వేల శాఖలు ఉన్నాయి
- 1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
- 1943 : ఎడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు
జననాలు
- 1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.
- 1917: నల్లా రెడ్డి నాయుడు, ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. (మ.1982)
- 1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
- 1938: శివకుమార్ శర్మ, ప్రముఖ సంతూర్ వాద్య సంగీత విద్వాంసుడు.
- 1940: అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయ వేత్త.
- 1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.
మరణాలు
- 1977: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
- 2014: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
- 2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
- 2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
- 2017: అంగర సూర్యారావు, ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)