ఈ ఏడాది ఇంటర్ మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇంటర్ బోర్డు తత్కాల్ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ అడ్వాన్స్డ్ పరీక్షలకు ఫీజు కట్టలేని వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం నుండి ( నేటి నుండి ) 10వ తేదీ వరకు రూ.3 వేలు పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావొచ్చు..!