లోషన్లు , పౌడర్లు ,
మురికి వంటి వాటికారణముగా బంగారు ఆభరణాల పై నెమ్మదిగా పల్చని పొరలాంటిది
ఏర్పడి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది . తగిన జాగ్రత్తలు ద్వారా మెరుపును తిరిగి తీసుకురావచ్చును
.
* ఒక పాత్రలో సగం దాకా గోరువెచ్చని
నీరు పోసి రెండు టేబుల్ స్పూన్లు వాషింగ్ లిక్విడ్ కలిపి ఆభరణాలను 30 నిముషాల సేపు
నానబెట్టి టూత్ బ్రెష్ తో సున్నితముగా బ్రెష్ చేయాలి . గోరువెచ్చని నీటిలో కడిగి మెత్తని
కాటన్ గుడ్డ తో తుడవాలి. ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుంది .
* అమ్మోనియా + నీరు సమపాళ్ళలో తీసుకుని
ఆభరణాలను 20 నిమిషాలు నానబెట్టి టూత్ బ్రెష్ తో స్క్రబ్ చేయాలి. ట్యాప్ కింద కడిగి
వస్త్రము తో తుడవాలి.
* స్కికా ఉండే టూత్ పేస్ట్ తో ఆభరణాలు
క్లీన్ చేయకూడదు . సిలికా వల్ల మెరుపునిచ్చే ఫినిషింగ్ దెబ్బతింటుంది . కొంతకాలానికి
బంగారు ఆభరణల వన్నె తగ్గిపోయి పేలవం గా కనిపిస్తాయి.
* చింత పండు రసములో బంగారు ఆబరణాలు
30 నిమిషాలు నానబెట్టి ... టూత్ బ్రెష తో క్లీన్ చేసి మెత్తటి గుడ్డ తో తుడిస్తే దగదగ
మెరుస్తా్యి . దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వలన మురికి పోయి బంగారము మెరుస్తాయి
.jpg)
.jpg)