జననం :: 1869 అక్టోబర్ 2 (పోరు బందర్, గుజరాత్)
మరణం :: 1948 జనవరి 30
తల్లిదండ్రులు :: కరంచంద్ గాంధీ (తండ్రి) పుత్లీబాయి గాంధీ (తల్లి
జీవిత భాగస్వామి :: కస్తూర్బా గాంధీ (m. 1883 - 1944 )
సంతానం :: హరిలాల్ గాంధీ , మణిలాల్ గాంధీ , రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ
వృత్తి :: న్యాయవాది, వలసవాద, వ్యతిరేకి, రాజనీతిజ్ఞుడు
ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అన్నట్లు.. కొంత మంది ఇంటి పేరో, ఊరికొక్క వీధి పేరో కాదు గాంధీ. కరెన్సీ నోట్ మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు. భరత మాత తల రాతను మార్చిన విధాత గాంధీ.. తరతరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ.
మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు..
బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా మలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించడంతో భారత దేశానికి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యం పొందిన ఘనత కేవలం భారతదేశానికి మాత్రమే దక్కుతుంది.
ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ.
గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2 వ తేది కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు జన్మించాడు. కాగా గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో ఒక దివాన్ గా పనిచేసేవాడు. ఉన్నత విద్య చదవక పోయినా సమర్థుడైన ఉద్యోగిగా పేరు సంపాదించాడు. అలాగే తల్లి హిందూ సంప్రదాయాలను తప్పక పాటించే సాధ్వీమణి. తల్లి దండ్రుల సంరక్షణలో గాంధీజీ బాల్యం గడిచింది. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. తరగతి గదిలో ఎక్కువ బిడియ పడుతూ వెనుక వరసలో కూర్చొనే వాడు. పాఠశాల విడిచిన వెంటనే ఆట పాటల యందు ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి పోయేవాడు. ప్రాథమిక విద్య రాజ్కోట్లో, ఉన్నత విద్య కథియ వాడ్లో కొనసాగింది. గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. అయితే గాంధీ ఇందుకు నిరాకరించాడు. చెడు సావాసాల వల్ల పొగ త్రాగడం, మాంసం తినడం జరిగింది. అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది తిరిగి ఇటువంటి పనులు చేయనని తల్లి దండ్రులకు ప్రమాణం చేశాడు.
గాంధీకి 13వ ఏట కస్తూరి బాయితో బాల్య వివాహం జరిగింది. గాంధీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బారిష్టర్ విద్యను అభ్యసించడాకి తన 17 వ ఏట లండన్ నగరాకి వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం కఠోర నియమాలతో విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కొంత కాలం ముంబై, కథియ వాడ్ లలో న్యాయవాదిగా ప్రాక్టీసు నిర్వహించారు. సత్య వాక్య పరిపాలనా దక్షుడైన గాంధీజీకి ఎన్నో సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురై బాధ కలిగింది. కాగా 1893 లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లాడు. అయితే అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొని మిక్కిలి మనస్తాపానికి గురయ్యాడు. అయినా మొక్కవోని ధైర్యంతో సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని శ్వేత జాతీయుల దురహంకారన్ని ఎదిరించి జాతి భేదాన్ని తొలగించేందుకు అవిశ్రాంత పోరాటాన్ని సాగించాడు. ట్రాన్స్ వాల్ పట్టణంలో ఫోక్స్ ఆశ్రమాన్ని స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపీయన్ అనే వార పత్రికను స్ధాపించాడు. కాగా 1915 జనవరి 9 వ తేది న దక్షిణాఫ్రికా నుండి భారత దేశాకి తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమ్నా స్దాపించాడు. ఇక్కడే తన అనుచరులకు సత్యం, అహింస మొదలగు మార్గాలను అనుసరించే విధాన్నా బోధించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ మహాత్మా అని సంబోధిస్తూ టెలిగ్రాం పంపాడు.
లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను తొలిసారిగా కలుసుకున్నాడు. ఇతర జాతీయ నాయకులు సంస్కరణల కోసం చర్చలు సాగిస్తుండగా గాంధీజీ బీహార్ లో చంపారన్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. ఇక్కడి రైతులు తీన్ కథియా అనే పద్ధతికి కట్టుబడి ఉండేవారు. తమ భూముల్లో పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విని చాలా మంది చంపారన్ రైతులు తమ ప్రాంతానికి వచ్చి కాపాడమని ఆయనను ఆహ్వాంచారు. గాంధీ అక్కడికి వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వానికి తెలియ పరచడంతో తీన్ కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ సాధించిన ఈ విజయం అనేక మంది యువ జాతీయ వాదులను ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, గుణ శీలమైన, నిర్ణయాత్మకమైన, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారి ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే గుజరాత్ లో కైరా జిల్లాలో పంటలు పండక పోయినప్పటికీ పన్నులు చెల్లించమని రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు నిరసనగా 1918లో సత్యాగ్రహం ప్రారంభించాడు. అపుడు ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేసింది. ఇదే సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పనివారు తమ వేతనాలను పెంచమని సమ్మె చేయగా గాంధీజీ సత్యాగ్రహం చేపట్టి మిల్లు యజమానులను అంగీకరింప జేసి కార్మికుల వేతనాల్లో 35 శాతం పెరుగుదలను సాధించాడు. స్ధానిక ప్రాంతాలలో చేసిన సత్యాగ్రహ ప్రయోగాలలో విజయాన్ని సాధించిన తర్వాత గాంధీజీ తన దృష్టి జాతీయ సమస్యల వైపు మళ్లించాడు. కాగా బ్రిటిష్ ప్రభుత్వం 1919 లో ప్రవేశపెట్టిన మాంటేగు ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతీయులలో అసంతృప్తి కలిగించాయి. అంతే గాకుండా విప్లవ కారుల కార్యక్రమాలను అణచి వేసేందుకు విచారణ లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్టాన్ని చేసింది. భారతీయులందరూ ఈ చట్ట్నా తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా గాంధీజీ రౌలత్ చట్టాకి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా సాధారణ హర్తాళ్ కు పిలుపుచ్చాడు. ప్రజలు స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాలని సూచించాడు. ఈ పిలుపుకు స్పందించి దేశ ప్రజలందరూ అపూర్వ ఉత్సాహంతో కదలి వచ్చారు. ప్రజా ప్రతిఘటన అణచి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీజీ ఢిల్లీ కి వెళుతుండగా ఆయనను మధ్యలోనే ఆపి బలవంతంగా ముంబైకి పంపారు. గాంధీ ముంబైకి చేరుకున్న సమయంలో గుమిగూడిన ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ప్రజా నిరసన వెల్లువను అణచి వేత చర్య తో ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గాంధీజీ యంగ్ ఇండియా, నవ జీవన్ పత్రికల్లో సంపాదకత్వాన్ని ప్రారంభించాడు
1919 ఏప్రిల్ 10 న పంజాబ్లో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే నాయకులను అరెస్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అమృతసర్ లో ప్రజలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. కొంత మంది అధికారులు కూడా మరణించారు. ఇద్దరు బ్రిటిష్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వారి చర్య పట్ల నిరసన తెలిపేందుకు 1919 ఏప్రిల్ 13 న అమృత సర్ లో జలియన్ వాలా బాగ్ అనే విశాల మైన బహిరంగ స్ధలం ఉన్న ఒక తోట మైదానంలో అధిక సంఖ్య లో ప్రజలు సమావేశమయ్యారు. దీనికి మూడు వైపులా మూసి ఉండి కేవలం ఒక వైపు మాత్రమే ద్వారం ఉండేది. అప్పటి సైనిక కమాండర్ అయిన జనరల్ డి.డయ్యర్ తన సైనిక విభాగం తో చుట్టుముట్టి ఉన్న ఒక ద్వారాన్ని మూసివేయించి రైఫిల్లతో, మెషిన్ గన్లతో కాల్పులు జరపమని ఆదేశించాడు. సైనికులు తమ దగ్గర ఉన్న మందు గుండు సామాగ్రి అయిపోయేంత వరకూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. వేలాది మంది గాయ పడ్డారు. గాంధీజీ దీన్ని అత్యంత అనాగరిక చర్యగా పేర్కొని తీవ్రంగా ఖండించారు. కాగా 1920 లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ ప్రవేశ పెట్టిన సహాయ నిరాకరణోద్యమ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. 1942 లో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో భారత రాజకీయ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. గాంధీజీ బ్రిటిష్ పాలకులకు క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా గాంధీతో సహా చాలా మంది నాయకుల్ని నాటి ప్రభుత్వం నిర్భందించింది. అనంతరం నాటి భారతీయుల స్వాతంత్య్ర పోరాటానికి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావనిని భారతీయులకు అప్పగించింది.
కాగా స్వతంత్ర భారత అభివృద్ధి చూడక ముందే 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యాడు. ఆధునిక కాలంలో ఆవిర్భవించిన మహాత్ములలో ప్రప్రథముడు మన జాతిపిత. సత్యాహింసలు అనే ఆయుధాలతో భారతీయులను స్వతంత్ర సమర యోధులుగా తయారు చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు చరమ గీతం పాడిన మహా మనిషి ... భారత ప్రభుత్వం జనవరి 9 వ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా ప్రకటించింది.కాగా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నేటి పాలకులు, ప్రజలు అనుసరించి,ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం ఉండగలదని ఆశిద్దాం!
అహింస
అహింసను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని, అహింసను భారీస్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. అహింస సిద్ధాంతాన్ని భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానంలోనూ, హిందు, బౌద్ధ, జైన, యూదు, క్రైస్తవ మతాల్లోనూ పలుమార్లు పేర్కొన్నారు. గాంధీజీ తన విలువలనూ, జీవన విధానాన్నీ తన ఆత్మకథలో వివరించాడు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం, ధైర్యం కావాలనీ, అయితే ఇవి అందరిలో లేవనీ గ్రహించాడు. అందుకే అహింస అందరికి పాటించటం కష్టం అనీ, ముఖ్యంగా పిరికితనాన్ని కప్పివుంచటానికి వాడరాదనీ, ఒకవేళ పిరికితనం, హింస రెండింటిలో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తాను హింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తానన్నాడు.
హింసా విధానాల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికి గురయ్యాడు. ముఖ్యంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉదమ్సింగ్ల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నిరసన చేయలేదని కొన్ని వర్గాలు నిందించాయి.
ఈ విమర్శలకు జవాబుగా గాంధీజీ ఏమన్నాడంటే- "బ్రిటీషు వారితో ఆయుధాలు లేకుండా పోరాడాలని చెబితే ప్రజలు ఆచరించారు. కానీ ఇప్పుడు వారే హిందూ-ముస్లిం ఘర్షణలకు అహింస పనికిరాదు అని, అందుకు ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం ఆయుధం చేతబట్టాలి అంటున్నారు."
పురస్కారాలు, బిరుదులు
టైమ్ పత్రిక 1930 సంవత్సరపు టైమ్ పత్రిక వ్యక్తిగా ప్రకటించింది.1999 లో అల్బర్ట్ ఐన్ స్టీన్ తర్వాత రెండవ స్థానంలో శతాబ్ది వ్యక్తిగా గుర్తింపు పొందాడు. భారతప్రభుత్వం గాంధీ శాంతి బహమతిని ప్రముఖులైన సమాజసేవకులకు, ప్రపంచ నాయకులకు, పౌరులకు ఇస్తోంది. విదేశీయులలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా ఒక ప్రముఖ గ్రహీత. 2011లో టైమ్ పత్రిక అధిక ప్రాముఖ్యత గల 25 రాజకీయనాయకులలో ఒకడిగా పేర్కొంది.
అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. ఐదుసార్లు గాంధీని ప్రతిపాదించడం జరిగింది. 1937 లోనూ, 1947 లోనూ గుర్తింపు చిట్టిజాబితాలో చోటు చేసుకున్నాడు. ప్రతిపాదనకు కారణాలుగా చెప్పిన విషయాలలో ముఖ్యమైనవి: అతను రాజకీయ నాయకుడు . అంతర్జాతీయ చట్టాల రూపకర్త . సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ శాంతి సంస్థలతో అతనికి ఎంతో సంబంధం ఉంది. అతను జాతీయవాదే కాక అంతర్జాతీయ మానవతావాది కూడా. దక్షిణాఫ్రికాలో కూడా అతను భారతీయుల కోసమే పోరాడాడు. రెండవ ప్రపంచయుద్ధం కాలంలో శాంతి బహుమతి యిస్తే, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని యివ్వలేదట! 1948 లో ప్రతిపాదించినా గడువు తీరకముందే గాంధీ హత్య జరిగినందున ఇవ్వలేదట. ఆయితే మరణానంతరం ఇవ్వకూడదనే నియమం లేనట్లు, స్వీడన్ దేశీయుడైన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దాగ్ హమర్షెల్డ్కు మరణానంతరం ఇచ్చినందువల్ల తెలుస్తుంది
కొన్ని సంవత్సరాల తరువాత నోబెల్ కమిటీ గాంధీకి నోబెల్ బహుమతి ఇవ్వకపోవటానికి విచారం ప్రకటించింది. బహుమతి ఇవ్వడానికి ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పింది. 1989లో దలైలామాకు శాంతి బహమతి (14వ వ్యక్తిగా) ఇచ్చినపుడు కమిటీ అధ్యక్షుడు, ఈ బహమతిలో కొంతభాగం గాంధీ స్మృతికి నివాళి అని పేర్కొన్నాడు.
Click Here to Download PDF copy of Gandhi