Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 14 (JANUARY 14)

0

 సంఘటనలు

  • 1690: జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన జాన్‌ సి. డెన్నర్‌ 'క్లారినెట్‌' వాద్యాన్ని రూపొందించారు.
  • 1760: ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరిని బ్రిటిష్‌ కెప్టెన్‌ ఐరీకూట్‌ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు.
  • 1761: మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీ సేన విజయం సాధించింది.
  • 1857: ఇండియన్ బ్యాంకు, హిందూ పత్రికల వ్యవస్థాపకుల్లో ఒకడైన న్యాపతి సుబ్బారావు జన్మించాడు.
  • 1892: 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌'గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం. ఆయన పేరు మీదే దేవధర్‌ ట్రోఫీ నిర్వహిస్తారు.
  • 1964: ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్‌లో భారత బౌలర్‌ బాపూ నాదకర్ణి వరుసగా 21 మెయిడెన్‌ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్‌లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
  • 1969: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
  • 1987: దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్‌ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
  • 1998: గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
  • 2005: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత లలో బ్రాడ్‌బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.


జననాలు


  • 1856: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు. (మ. 1941]
  • 1896: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (మ.1982)
  • 1912: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (మ.2007)
  • 1926: కె.బి. తిలక్, స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (మ.2010)
  • 1926: మహా శ్వేతాదేవి, సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. (మ2016)
  • 1930: చిత్తజల్లు వరహాలరావు, నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు
  • 1937: రావు గోపాలరావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.1994)
  • 1937: శోభన్ బాబు, ప్రముఖ తెలుగు కథానాయకుడు. (మ.2008)
  • 1938: ఇందిరా నాథ్, సుప్రసిద్ధ భారతీయ మహిళా శాస్త్రవేత్త
  • 1951: జంధ్యాల, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001)
  • 1956: నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు
  • 1977: నారాయణ్ కార్తికేయన్, భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు.
  • 1977: నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.



మరణాలు


  • 1937: జయశంకర్ ప్రసాద్, ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు
  • 1973: నారు నాగ నార్య, 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది.
  • 1979: కేసనపల్లి లక్ష్మణకవి, సహజకవి, పండితుడు, విమర్శకుడు మరియు పౌరాణికుడు. (జ.1902)
  • 1980: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు.
  • 2016: మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)
  • 2017: సూర్జీత్ సింగ్ బర్నాలా, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925)
  • 2019: కట్టా రంగారావు తెలుగు సినిమా దర్శకుడు. (జ.1957)

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages