సంఘటనలు
- 1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి
- 1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
- 1980: భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.
- 1992: సుభాష్చంద్రబోస్కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
జననాలు
- 1865 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫార్మాసిస్టు.
- 1882: అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1962)
- 1885: మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహ.
- 1906: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
- 1909: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
- 1924: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)
- 1936: వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
- 1960: జమునా రాయలు, పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం, రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు.
- 1965: డయాన్ లేన్, అమెరికాకు చెందిన చిత్ర నటి.
- 1965: మలిశెట్టి వెంకటరమణ, మానవతావాది, పోలీసు అధికారి.
మరణాలు
- 1901: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (జ.1819).
- 1940: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863)
- 1972: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
- 2007: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919)
- 2014: అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (జ.1923)
- 2016: పండిట్ శంకర్ ఘోష్ భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)