ప్రతిభ గల విద్యార్థినులకు గుడ్న్యూస్. స్కాలర్షిప్ అందించడానికి ఎన్టీఆర్ (NTR) ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (జీఈఎస్టీ-2024)ను జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థ వెల్లడించింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు మే 15వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు.. తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేసేవరకు అందజేస్తారు. అలాగే క్యాట్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ శిక్షణ ఇస్తారు. విద్యార్థినులు పూర్తి వివరాలకు https://ntrtrust.org/ వెబ్సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం :
NTR Girls Education Scholarship Test 2024
అర్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు
అప్లయ్ చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో
జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలుగా నిర్ణయించారు.
పరీక్షాంశాలు: జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిస్ మ్యాథ్స్, ఇంగ్లిష్(12వ తరగతి స్థాయిలో) పరీక్ష ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.250 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే
15,
2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: జూన్
7,
2024
పరీక్ష తేదీ: జూన్ 9, 2024
స్థలం: ఎన్టీఆర్ జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ
టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్ఆర్ జిల్లా.
ONLINE REGISTRATION LINK CLICK HERE