ఈ మధ్యకాలం లో
మంచం లో నల్లుల బాధ తగ్గిపోయింది కాని ఒకానొకప్పుడు ఆ నల్లులు జనాన్ని చాలా ఇబ్బంది
పెట్టేవట...
ఆ సందర్భం లో
వ్రాసిన ఈ చాటువు చూడండి...
శివడద్రిని శయనించుట,
రవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుండ విరళముగ శేషుని పై బవళించుట
నల్లిబాధ పడలేక సుమీ.
శివుడు హిమాలయ
పర్వతం మీద శయనిస్తాడు.
సూర్యుడు , చంద్రుడు ఆకాశంలో ఉంటారు.
విష్ణుడెప్పుడు పాలసముద్రంలో శేషతల్పం మీద పడుకుంటాడు.
వీరంతా భూమి మీద ఉండకుండా ఆయా చోట్ల ఉండడం నల్లికి
భయపడే - అని చమత్కారం.
మనం పడే నల్లి
బాధ ఎంత భయంకరమైనదో తెలియచెప్పడానికి ఇంత గొప్ప దేవతలు కూడా నల్లి బాధ పడలేకనే అటువంటి
నివాసాలు ఏర్పరచుకున్నారని ఒక కవి చమత్కారం.