చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 28 (TODAY IN HISTORY FEBRUARY 28)
సంఘటనలు
- 1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
- 1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
జననాలు
- 1920: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు (మ.1987)
- 1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)
- 1928: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాల సానుభూతిపరుడు (మ. 2011)
- 1944: రవీంద్ర జైన్, సంగీత దర్శకుడు (మ.2015)
- 1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.
- 1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత
- 1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
- 1959: జయమాల , కన్నడ సినీనటి, తెలుగు,తమిళ చిత్రాల్లో నటించారు.
- 1969: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)
- 1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.
- 1978: నందిత , సినీ గాయకురాలు
- 1979: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్
- 1980: శ్రీరామ్ , తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల నటుడు .
- 1885: బాబు చోటేలాల్ శ్రీవాత్సవ భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
మరణాలు
- 1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)
- 2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
- 2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)
పండుగలు , జాతీయ దినాలు
- జాతీయ విజ్ఞాన దినోత్సవము
- దర్జీ ల దినోత్సవము