AP: రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుండి ఒంటిపూట బడులు (Half-Day Schools) ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం అందిస్తారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి.