సంఘటనలు
1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
2018: తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జననాలు
- 1935: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (మ.2016)
- 1937: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (మ.1987)
- 1950: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- 1972: ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
మరణాలు
- 1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
- 2002: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
- 2008: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
- 2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)