సంఘటనలు
- అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.
- 1948 : జాతిపిత మహాత్మా గాంధీ ని నాథూరాం గాడ్సే హత్య చేసాడు.
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
- అమరవీరుల సంస్మరణ దినం,
- గాంధీజీ వర్థంతి,
- కుష్టువ్యాధి నివారణ దినోత్సవం
జననాలు
- 1889 : ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు జయశంకర్ ప్రసాద్ జననం (మ.1937).
- 1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్
- 1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ కవి
- 1910: సి.సుబ్రమణ్యం, సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
- 1913 : ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్ జననం (మ.1941).
- 1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, ప్రముఖ చర్మవైద్యులు. (మ.2005)
- 1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు
మరణాలు
- 1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
- 1948 : రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).
- 1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, ప్రసిద్ధ పండితులు మరియు రచయిత. (జ.1892)
- 2005: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)
- 2016: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
- 2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
- 2016: జోగినిపల్లి దామోదర్రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ, ప్రజా సేవకుడు.