చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 12
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
- జాతీయ ఉత్పాదనా దినోత్సవం
- గులాబీల దినోత్సవం
- డార్విన్ డే .
సంఘటనలు
- 1502: పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడగామా భారతదేశానికి తన రెండవ సముద్రయానం కోసం
బయలుదేరాడు.
- 1700: ఉత్తర ఐరోపాలో డెన్మార్క్-నార్వే,
సాక్సోనీ మరియు రష్యా మరియు స్వీడిష్ సామ్రాజ్యం మధ్య గ్రేట్ నార్తర్న్
యుద్ధం ప్రారంభమైంది.
- 1818: మూడు శతాబ్దాల స్పానిష్ వలస పాలన తర్వాత చిలీ స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది.
- 1909: నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (NAACP),
అమెరికా యొక్క పురాతన మరియు అతిపెద్ద పౌర హక్కుల సంస్థ స్థాపించబడింది.
- 1912: చైనా యొక్క చివరి చక్రవర్తి అయిన పుయీ, రిపబ్లిక్ ఆఫ్
చైనాకు మార్గం సుగమం చేయడానికి పదవీ విరమణ చేయవలసి వచ్చింది.
- 1922: భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు మహాత్మా గాంధీ దేశంలో పెరుగుతున్న హింసపై బ్రిటిష్
వారికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం నుండి వైదొలిగారు.
- 1941: మొట్టమొదటి పెన్సిలిన్ ఇంజెక్షన్ను వైద్యుడు చార్లెస్ ఫ్లెచర్ బ్రిటిష్ పోలీసు
ఆల్బర్ట్ అలెగ్జాండర్కు అందించాడు.
- 1946: ఆఫ్రికన్ అమెరికన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వెటరన్ ఐజాక్ వుడార్డ్ సౌత్ కరోలినా
పోలీసులచే తీవ్రంగా దాడి చేయబడ్డాడు, అతను శాశ్వతంగా అంధుడిని
అయ్యాడు మరియు పౌర హక్కుల ఉద్యమాన్ని ప్రేరేపించాడు.
- 1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.1993లో,
ఇంగ్లండ్లోని అత్యంత దిగ్భ్రాంతికరమైన నేరాలలో ఒకటైన రెండేళ్ల పాప జేమ్స్
బుల్గర్ను ఇద్దరు పదేళ్ల వయసున్న అబ్బాయిలు కిడ్నాప్ చేసి, హింసించారు
మరియు చంపారు.
- 2001: నియర్ షూమేకర్ 433 ఎరోస్లోని "సాడిల్" ప్రాంతంలో
ఆస్టరాయిడ్పై కక్ష్యలో మరియు దిగిన మొదటి అంతరిక్ష నౌకగా నిలిచింది.
- 2011 -
2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద
సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31)
- 2012: యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినందుకు
జెఎన్యు విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
జననాలు
- 1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
- 1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
- 1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు.
(మ.1883)
- 1881 : రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931)
- 1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
- 1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా
ప్రతినాయకుడు.
- 1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ
నాయకుడు.
- 1987: సాహితీ గాలిదేవర, దక్షిణ భారత నేపథ్య
గాయకురాలు.
మరణాలు
- 1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
- 1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద
తత్వవేత్త. (మ.1724)
- 1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన
క్రైస్తవ మిషనరీ. (జ.1806)
- 1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)
- 1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)
- 2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
- 2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
- 2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు.
(జ.1937)
- 2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా
దర్శకుడు. (జ.1936)
- 2022: పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1950
మరి కొన్ని విశేషాలు క్లుప్తంగా
స్వామి దయానంద సరస్వతి :
ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఞానం, దారిద్య్రం, అన్యాయాన్ని ఎదిరించి
పోరాడిన యోగి స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు. ఈయన 1824 ఫిబ్రవరి 12న గుజరాత్ రాష్ట్రం
ఠంకార గ్రామంలోని వర్తక కుటుంబంలో జన్మించాడు. ఇతని అసలు పేరు మూల శంకర్. చిన్నతనంలో
భగవంతుడిని అన్వేషిస్తూ అనే మంది యోగులు, మునులను కలిసి
దయానంద అనే పేరును పొందారు. దేశంలో జరుగుతున్న దురాక్రమణలు, అంటరానితనం, బాల్య వివాహాలు, ధర్మం పేరుతో దురాచారాలను చూసి.. వాటిని ఛేదించేందుకు పాఖండ
ఖండిని అన్న పతాకాన్ని ఆవిష్కరించాడు. ఆయన రాసిన సత్యార్థ ప్రకాశ్లో భారత దేశంలోని
దూరాచాలను ఎలా నిర్మూలించాలో రచించాడు. 1875 ఏప్రిల్ 10న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజాన్ని స్థాపించాడు.
చార్లెస్ డార్విన్ :
ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది చార్లెస్
డార్విన్.ఈయన 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లాండులోని ష్రూస్ బరీలో జన్మించారు. నేచర్ సైంటిస్ట్ గా, జియాలజిస్ట్, బయాలస్ట్, రచయితగా ప్రసిద్ధుడు. భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందింది
అనే విషయంపై పరిశోధనలు చేసి జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రకృతిలో జీవజాతులు
తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు.
ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది.
అబ్రహం లింకన్ :
అమెరికా
దేశ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1809లో థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు.
అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించాడు.తన పాలనతో అమెరికా ఎప్పటికీ
మరిచిపోలేని అధ్యక్షునిగా పేరుగాంచాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ అంతర్యుద్ధంలోనే హత్య
చేయబడ్డాడు.
విజయ బాపినీడు :
1936 సెప్టెంబరు 22న ఏలూరులని చాటపర్రు గ్రామంలో జన్మించాడు.
1982లో దర్శకుడిగా తెలుగు సినీరంగానికి పరిచయమైన ఆయన తన సినీప్రస్థానంలో
22 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన ఎక్కువగా చిరంజీవితో గ్యాంగ్లీడర్, ఖైదీ నం.786, బిగ్బాస్, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు, శోభన్ బాబు నటించిన
చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి
సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన కొడుకులు బాపినీడు
చివరి చిత్రం. ఈయన 2019, ఫిబ్రవరి 12న హైదరాబాద్లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.
జగపతిబాబు :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా
పేరు తెచ్చుకున్న నటుడు జగపతి బాబు జన్మదినం నేడు. ఈయన 1962లో మచిలీపట్నంలో జన్మించారు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్
బ్యానర్ అధినేత, దర్శకుడు వి. బి. రాజేంద్రప్రసాద్. జగపతిబాబు
అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. దాదాపు 100 చిత్రాల్లో నటించి
7 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇక 1989లో సింహస్వప్నం సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టారు. ఇందులో
జగపతిబాబు డబుల్ రోల్ చేశారు. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో
సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే మావిచిగురు సినిమాతో ఆయనకు మొదటిసారి ఉత్తమ
నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.
సీహెచ్ విద్యాసాగర్ రావు :
బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్
రావు 1942 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాగారంలో జన్మించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తి చేపట్టిన ఈయన 1980లో తొలిసారిగా కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఆ తర్వాత 1985లో మెట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారి
గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి నేతృతంలోని
ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర గవర్నర్గా
పనిచేయడంతోపాటు తమిళనాడుకు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
పి.సూరిబాబు :
నటుడు, గాయకుడు అయిన పి.సూరిబాబు 1915లో ఫిబ్రవరి 22 జన్మించి, 1968 ఫిబ్రవరి 12న మరణించారు. వివిధ వేషాలు
వేసే సూరిబాబు అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. దక్షయజ్ఞం, ఉషా పరిణయం, సతీ సావిత్రి సినిమాలో
నటించడంతోపాటు వందల పాటలు పాడారు.