స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మార్గదర్శకాలు
1. ఈ నెల 18న (శనివారం) అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర స్థాయి "స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమం జరుగుతుంది.
2. ప్రతి నెల మూడవ శనివారాన్ని "స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం"గా పాటించాలి.
3. అన్ని నగరాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లు నిర్వహించాలి.
4. డ్రైనేజీలు, కాలువలు, చెరువులను శుభ్రం చేసి నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
5. చెత్త వేసే ప్రాంతాలను (GVPs) గుర్తించి, వాటిని శుభ్రం చేసి పచ్చదనంతో అందంగా మార్చాలి.
6. వంద శాతం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను విడిగా సేకరించాలి.
7. పబ్లిక్ మరియు కమ్యూనిటీ టాయిలెట్లను శుభ్రం చేసి నీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలి.
8. ప్రజలు, స్వయం సహాయక సంఘాలు (SHGs), స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ అవగాహన ర్యాలీలు చేపట్టాలి.
9. పబ్లిక్ ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలి.
10. ప్రతి జిల్లాలో సీపీఓ (CPO)లను నోడల్ ఆఫీసర్లుగా నియమించి, కార్యక్రమ వివరాలను, ఫోటోలను SASA యాప్లో అప్లోడ్ చేయాలి.